Ticker

6/recent/ticker-posts

రూపాయి పతనం అవుతోన్న ఆర్బీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు?


ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యం రూపాయి విలువను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉదాహరణకు, $1 = ₹80 వంటి అంకెకు పరిమితం చేయాలనే వ్యూహంలో ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ చారిత్రక కనిష్ఠానికి చేరుకుంటున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దూకుడుగా జోక్యం చేసుకోకపోవడం వెనుక స్పష్టమైన ఆర్థిక , వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. రూపాయి విలువ పతనంపై ఆర్‌బీఐ "పట్టించుకోవడం లేదు" అనే భావన కంటే, దాని జోక్యాన్ని ఒక నిర్దిష్ట లక్ష్యం..పరిమిత వ్యూహానికి పరిమితం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


ఆర్‌బీఐ పరిమిత జోక్యం వెనుక వ్యూహం 
ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యం రూపాయి విలువను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉదాహరణకు, $1 = ₹80 వంటి అంకెకు పరిమితం చేయాలనే వ్యూహంలో ఉంది. కేవలం అస్థిరతను నియంత్రించడానికే ఆర్‌బీఐ తన జోక్యాన్ని పరిమితం చేస్తుంది. రూపాయి విలువ ఒక్కసారిగా, అనూహ్యంగా పడిపోకుండా లేదా పెరగకుండా మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడమే దాని ప్రథమ లక్ష్యం. రూపాయి బలహీనపడటం ఎగుమతులకు ప్రయోజనకరం. ముఖ్యంగా అమెరికా వంటి దేశాలు భారీ టారిఫ్‌లు (పన్నులు) విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, బలహీన రూపాయి మన వస్తువులను అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా మారుస్తుంది, తద్వారా మన ఎగుమతి పోటీతత్వాన్ని పెంచుతుంది. ఈ ఆర్థిక ప్రయోజనాన్ని ఆర్‌బీఐ పరోక్షంగా అనుమతిస్తోంది. 

భారత్ వద్ద బలంగా ఉన్న విదేశీ మారకపు నిల్వలను కేవలం ఒక నిర్దిష్ట స్థాయిని కాపాడుకోవడానికి పూర్తిగా ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో ఆర్‌బీఐ స్పాట్‌ మార్కెట్‌లో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు లేదా మార్కెట్ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఈ నిల్వలు బలంగా ఉండటం ముఖ్యం. 

* రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలు 
రూపాయి క్షీణతకు కారణాలు ప్రధానంగా అంతర్జాతీయంగా.. భౌగోళిక రాజకీయంగా ఉన్నాయి, వీటిని కేవలం ఆర్‌బీఐ జోక్యంతో నియంత్రించడం కష్టం. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు వంటి అంశాలు పెట్టుబడిదారులలో అపనమ్మకాన్ని పెంచి, సురక్షితమైన పెట్టుబడిగా భావించే అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపడానికి దారితీశాయి. అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్‌లు , అక్కడి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానాలు డాలర్‌ను బలోపేతం చేసి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల (EMs) నుండి పెట్టుబడులు తరలిపోవడానికి కారణమయ్యాయి. అంతర్జాతీయంగా రిస్క్ పెరగడం వల్ల, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) దేశీయ మార్కెట్లలో తమ పెట్టుబడులను విక్రయించి, డాలర్లలోకి మార్చుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది. 

ఆర్‌బీఐ లక్ష్యం "స్థిరత్వం" మాత్రమే 
రూపాయి విలువ వరుసగా రెండేళ్లపాటు క్షీణత దిశలోనే సాగుతున్నప్పటికీ, ఆర్‌బీఐ యొక్క ప్రస్తుత విధానం సరైనదేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే: ప్రపంచ మార్కెట్లలోని అస్థిరత, భౌగోళిక రాజకీయ సమస్యలు అమెరికా ఆర్థిక విధానాలు వంటి బహిరంగ కారణాల వల్ల రూపాయి పతనం జరుగుతున్నప్పుడు, ఆర్‌బీఐ పూర్తి నియంత్రణ సాధించడం సాధ్యం కాదు. అందుకే, రూపాయి విలువపై పూర్తి నియంత్రణ సాధించడానికి ప్రయత్నించకుండా, కేవలం తీవ్ర హెచ్చుతగ్గులను అదుపులో ఉంచి, స్థిరత్వాన్ని కాపాడటం మాత్రమే ప్రస్తుతం ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహం విదేశీ మారకపు నిల్వలను పరిరక్షించడానికి.. దేశీయ ఎగుమతి రంగానికి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికి దోహదపడుతుంది.