Ticker

6/recent/ticker-posts

నిద్రలోనే నలుగురు మృతి...మృతుల్లో ఇద్దరు కవలలు


ANDRAPRADESH: అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చి ఊపిరాడక ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతులు తాత, మవనడు, ఇద్దరు మనవాళ్లు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి దంపతులు. మురళి తన తండ్రి రామచంద్రయ్యతోపాటు తన ముగ్గురు పిల్లలతో కలిసి నివశిస్తున్నారు. 


ఇకపోతే మురళి బైక్‌కు ఇంజిన్ సమస్య వచ్చింది. దీంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా బైక్ బోర్‌కు వచ్చిందని తెలిపాడు. దీంతో బోర్ చేయించాడు. అనంతరం బైక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రంతా ద్విచక్రవాహనం స్టార్టింగ్‌లో ఉంచాలని మెకానిక్ చెప్పడంతో మురళి తన బైక్‌ను రాత్రంతా స్టార్ట్ చేసే ఉంచాడు. బయట ఉంచితే దొంగలు ఎత్తుకెళ్తారనే భయంతో ఇంట్లో బైక్‌ను ఉంచి స్టార్ట్ చేసి నిద్రపోయారు.

ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మురళి, రేవతి దంపతులు ఇంటిపైన గదిలో పడుకున్నారు. అయితే రామచంద్రయ్య, మనవడు కార్తీక్, మనవరాళ్లు చరిత, చందనలు బైక్ స్టార్ట్ చేసి ఉంచిన గదిలోనే నిద్రపోయారు.ఇల్లు ఇరుకుగా ఉండటం బైక్ నుంచి వచ్చిన పొగ కార్బన్ మోనాక్సైడ్ బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఇళ్లంతా వ్యాపించింది.విషపూరితమైన పొగ గది మెుత్తం వ్యాపించింది. ఆ పొగ పీల్చి తాత, మనవడు కార్తీక్, మనవరాళ్లు చందన, చరితలు నిద్రలోనే మృతి చెందారు.

ఆదివారం తెల్లవారు జామున మురళి, రేవతి దంపతులు కిందకు వచ్చి చూశారు. ఇంట్లో పిల్లలు, తండ్రిని లేపేందుకు ప్రయత్నించగా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి చూశాడు. అప్పటికే ఇల్లంతా కార్బన్ మోనాక్సైడ్‌తో నిండిపోయింది. అంతేకాదు నలుగురు విగత జీవులుగా పడి ఉండటాన్ని మరళి దంపతులు గమనించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

బయటపడింది ఇలా
అయితే బోర్ చేయించిన బైక్ నుంచి వచ్చిన పొగే నలుగురు ప్రాణాలు బలితీసుకుంది. నలుగురిని బతికించుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే నలుగురు చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఇంటిపైన నిద్రిస్తున్న మురళి, రేవతిలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. కుటుంబంలో నలుగురు ఒకేసారి మృతి చెందడంతో మురళి, రేవతి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్లముందే తన కుమారుడు, కుమార్తెలు, తండ్రి ఇలా నలుగురు మృతి చెందడంతో వారు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటనతో పుంగనూరు పట్టణంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.