Ticker

6/recent/ticker-posts

భీమవరం: తప్పతాగిన యువతి.. రోడ్డుపైనే, వాహనదారుల షాక్..!


ANDRAPRADESH, WESTGODAWARI, BHIMAVARAM: సిగరెట్, మద్యం.. ఆరోగ్యానికి హానికారం, ప్రభుత్వం చెప్పే ప్రకటన మాత్రమే కాదు.. తాగే సిగరెట్, మందుబాటిళ్లపైన కూడా ఇదే రాసి ఉంటుంది. కానీ మందు ఇచ్చే నిషా కోసం మందుబాబులు.. ఇవన్నీ పట్టించుకుంటేగా. తాగితే ఒళ్లు హూనమవుతుందని.. ఇళ్లు గుళ్లవుతుందని పెద్దలు చెప్పే మాటలు.. మందు ఇచ్చే మత్తు ముందు వినబడితేగా. ఇక తాగి ఊరుకుంటారా అంటే కొంతమంది చేసే పనులు.. నవ్వు తెప్పించడమే కాదు, పక్కవారికి చికాకును కూడా కలిగిస్తాయి. అలాంటి ఘటనే ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది.


భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి నానా హంగామా చేసింది. మందు తాగిన మత్తులో రోడ్డుపై హల్ చల్ చేసింది. ఫూటుగా మద్యం తాగి.. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డుకు అడ్డంగా పడుకుంది. యువతి తీరుతో భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. సుమారుగా 20 నిమిషాల పాటు రోడ్డుపై యువతి నానా హంగామా చేసింది. దీంతో ట్రాఫిక్ జామ్ జరిగి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. యువతి తీరును తప్పుబడుతున్నారు.

తాగిన మత్తులో తల్లిదండ్రులపై దాడి
మరోవైపు మద్యం మత్తులో ఓ కొడుకు.. తన తల్లిదండ్రులపైనే దాడి చేసిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ముసునూరుకు చెందిన కొండయ్యకు తాగుడు అలవాటు. మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో భార్యాబిడ్డలను తిడుతూ దాడికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన అతని తల్లిదండ్రులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో కోపంతో ఊగిపోయిన కొండయ్య మద్యం మత్తులో వారిపై కర్రతో దాడి చేశారు. కర్రతో తలలపై కొట్టడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం స్థానికులు వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మరోవైపు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోనూ ఇటీవల ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంంది. మద్యం షాపు వద్ద సిట్టింగ్ రూములు లేవంటూ ఓ మందుబాబు రెచ్చిపోయాడు. నడిరోడ్డుపైనే సిట్టింగ్ వేసి నిరసన వ్యక్తం చేశాడు. మందుబాటిల్ చేతిలో పట్టుకుని, నడి రోడ్డుపై కూర్చుని తాగుతూ నానా హంగామా చేషాడు. సిట్టింగ్ రూమ్‌లు లేవని.. వెంటనే లిక్కర్ షాపు వద్ద సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలంటూ మందుబాటిల్‌తో నిరసన తెలిపాడు.

సిట్టింగ్ రూమ్‌లను లిక్కర్ షాపు వద్ద ఏర్పాటు చేయకపోతే.. మళ్లీ వస్తానని, ఫుల్ బాటిల్ ఇక్కడికే వచ్చి తాగుతానని.. ఎవరు ఏం చేస్తారో చేయండి అంటూ మందు బాబు ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. మనోడి తీరుతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాళహస్తి ఘటన మరువకముందే భీమవరంలో మద్యం మత్తులో యువతి రోడ్డుపై హల్ చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.