రంపచోడవరం/ప్రతినిధి: వైసిపి పాలనలో గత 60 నెలలుగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని సైకోకి రంపచోడవరంలో గల అనంతబాబు అనే మరో సైకో తోడై అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నరని, ఇంకా కొద్దీ రోజుల్లో వీరి పీడ విరగడ అవుతుందని గిరిజనులను, గిరిజనేతరులను గుప్పెట్లో పెట్టుకొని నియంతలా పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లను స్థానికులు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందని, ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే చేపడతామని స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో మారుమూల గ్రామాలైన చెరుకుపాలెం జడ్డంగి, సింగంపల్లి, వట్టిగడ్డ దూసరపాము, రాజవోమ్మంగి వరకు రంపచోడవరం నియోజవర్గ అభ్యర్థిని మిరియాల శిరీష దేవితో కలిసి బైక్ ర్యాలీ రోడ్డు షో పర్యటన చేపట్టారు.
రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, ఈ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. ర్యాలీలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికారు.
Social Plugin