అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన మహిళా వారోత్సవాలు జిలుగుమిల్లి మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.
పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు, జిలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్.ఐ క్రాంతి కుమార్ మరియు వారి సిబ్బంది స్థానిక విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జిలుగుమిల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు దర్భగూడెంలోని పీటర్సన్ హైస్కూల్ విద్యార్థులకు “మహిళా భద్రత మరియు సాధికారత” అంశంపై అవగాహన కల్పించారు.
వ్యాసరచన పోటీలు
చిత్రలేఖన పోటీలు
విద్యార్థులు మహిళా శక్తి, ఆత్మవిశ్వాసం, స్వావలంబనను ప్రతిబింబించే చిత్రాలను గీశారు. సమానత్వ సందేశాన్ని ప్రతిఫలించేలా రూపొందించిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎస్.ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచే మహిళల పట్ల గౌరవ భావం పెంపొందించాలని సూచించారు. మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. మహిళా హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల విజేతలకు త్వరలో బహుమతులు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


.jpeg)
