Ticker

6/recent/ticker-posts

చంద్రబాబు పవన్ ఏకాంతంగా చర్చలు !


ANDRAPRADESH: ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశం సైతం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. కూటమి సారధి చంద్రబాబుకు అభినందనలు తెలియచేస్తూ మంత్రులు అందరూ చప్పట్లతో సమావేశంలో ఒక సందడిని సృష్టించారు.


చంద్రబాబు సైతం ఎంతో ఆనందంగా మంత్రులతో ముచ్చటించారు. మన ఏడాది పాలన బాగుందని బాబు చెప్పేసరికి మంత్రులతో పాటు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ప్రతీ రోజూ సర్వేలు చేయిస్తూ జనాభిప్రాయాన్ని కూడగట్టడంతో చంద్రబాబుని మించిన వారు లేరు. అందువల్ల ఆయన తన నివేదికలు అన్నీ క్రోడీకరించి ఈ మాట చెప్పారని అంతా భావిస్తున్నారు.

తొలి ఏడాదిలోనే ఎంతో చేశామని ఇంతకు ఇంతా మిగిలిన కాలంలో చేయాలని బాబు దిశా నిర్దేశం చేశారు. మరో వైపు చూస్తే మంత్రి వర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి మంత్రులు అంతా కలసి సరదాగా భోజనాలు చేయడం ఈసారి విశేషంగా చెబుతున్నారు.

ఒక పండుగ వాతావరణంలో ఇదంతా జరిగింది అని అంటున్నారు. మూడు పార్టీలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం నడుపుతూ అందరినీ కలుపుకుని పోతూ తొలి ఏడాది ఏపీ లాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో నిర్వహించడం అంటే టఫ్ టాస్క్ గానే భావించాలి.

కానీ దానిని చంద్రబాబు సాధించారు అని అంటున్నారు. పైగా కూటమి ఏడాది పాలన మీద ఓవరాల్ గా సంతృప్తి జనంలో ఉందని ఒక ఫీడ్ బ్యాక్ కూడా కూటమి పెద్దలకు అందడంతో మరింత ఖుషీ అవుతున్నారు. రానున్న కాలంలో ఈ ఇబ్బందులు మెల్లగా తొలగిపోతే మంచి రోజులు వస్తాయని అపుడు ప్రజలకు ఇంకా మేలు చేయవచ్చు అన్నది కూటమి ప్రభుత్వ పెద్దల భావనగా ఉంది.

ఇక మంత్రి వర్గ సమావేశంలో మరో విశేషం ఏమిటి అంటే చంద్రబాబు పవన్ ఏకాంతంగా ముచ్చటించుకోవడం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సీఎం చంద్రబాబు కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు విషయాలు చర్చించుకున్నారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన కడప మహానాడు నిర్వహణపై కూడా పవన్ తో చర్చించారు అని అంటున్నారు. ఈసారి మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగిందని కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూలతను మహానాడు చాటి చెప్పిందని బాబు చెప్పారని అంటున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో పవన్ చంద్రబాబు కలుసుకోవడం అన్నది పెద్దగా కుదరలేదు. దాంతోనే ఇద్దరూ కలసి కొంత సేపు ఏకాంతగా మాట్లాడుకున్నారని అంటున్నారు. అమరావతి రాజధాని పనులతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఇద్దరు నేతలూ చర్చించారని అంటున్నారు. పూర్తిగా సానుకూల వాతావరణంలో ఈ ఇద్దరి భేటీ సాగింది అని అంటున్నారు.