ANDRAPRADESH: రాజు గారి అమ్మాయి పూసపాటి వారి వారసురాలు ఇలా ఆలా విశేషణాలు ఉన్న ఆమె విజయనగరం శాసనసభ స్థానం నుంచి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచారు. ఆమె అదితి గజపతి రాజు. ఆమె 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినా వైసీపీ ప్రభంజనం లో గెలుపు తీరం చేరలేకపోయారు.
ఆమె రాజకీయం పూసపాటి వారి వారసత్వం. ఆమె ఈ రోజుకీ తండ్రి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అడుగు జాడలలో నడుస్తూ ఉన్నారు. తండ్రి తర్ఫీదు లో ఆమె రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ రాటు తేలుతున్నారు.
తాజాగా ఆమె వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ జూన్ 4న నిర్వహిస్తున్న భారీ నిరసన కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా టీడీపీ కూటమి నేతలు తప్పు పడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి జగన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అతిది గజపతి రాజు కూడా మీడియా ముఖంగా జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్ పాలనలోనే హామీలు అన్నీ నెరవేర్చకుండా తుంగలోకి తొక్కి పేదలకు వెన్నుపోటు పొడిచారు అని ఆమె అన్నారు.
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు నరకం చూపించారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే హామీలు అధిక శాతం నెరవేర్చి ప్రజలకు మేలు చేశామని ఆమె చెప్పారు. సంక్షేమం ప్లస్ అభివృద్ధికి చిరునామా చంద్రబాబు మాత్రమే అని అదితి గజపతి రాజు కితాబు ఇచ్చారు.
వైసీపీది విద్వంశం పాలన కూటమిది వికాస పాలన అని తేడా చెప్పారు. ఈ విధంగా జగన్ మీద ధాటీగా విమర్శలు చేయడం ద్వారా రాజు గారి అమ్మాయి తానూ ధీటైన నేతను అనిపించుకున్నారు. రాజకీయాల్లో ఉన్న వారు ప్రత్యర్థుల మీద గట్టిగా విమర్శలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజులలో అదే చాలా అవసరం. అలాంటి వారినే జనాలతో పాటు పార్టీల పెద్దలు గుర్తు పెట్టుకుంటున్నారు. అదితి ముందు ముందు మరెన్ని విమర్శలు చేస్తారో ఆమె దూకుడు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
Social Plugin