INDAI, ANDRAPRADESH: తాజాగా ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. By: SRTV NEWS జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్.. మరింత పెరిగిందా? ఆయనకు కేంద్రంలోని పెద్దలు మరింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. జనసేన పార్టీ అధినేతగా ఆయన ఇప్పటికేచేరువయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల దగ్గర ఆయన మంచి మార్కులు కూడా వేయిం చుకున్నారు. అయితే.. ఇది విషయం కాదు. ఇప్పుడు మరింతగా ఆయన ఇమేజ్ పెరగడానికి కారణం.. పవన్ నిబద్ధతే నని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలో అందరూ ప్రధానిని ఆకాశానికి ఎత్తేశారు. సహజంగా పవన్ కూడా ఇదే చేస్తారని అందరూ అనుకుంటారు. అచ్చంగా కూడా ఇదే జరిగింది. అయితే.. దీనికి మించి.. రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న పథకాలు.. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం వంటివాటిని పవన్ వివరించారు. ఈ క్రమంలో 555 కోట్లతో గ్రామీణ సడక్ యోజనను ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్రెడిట్ అంతా.. ప్రధాని, సీఎంలదేనని .. అందరి ముందు చెప్పుకొచ్చారు. సహజంగా ఇలాంటివి జరిగి నప్పుడు విని ఊరుకోవడం.. రెండు చప్పట్లు కొట్టి అభినందించడం వరకు చేస్తారు. కానీ, అలా అయితే.. పవన్ ఇమేజ్ ఎలా పెరుగుతుందని చెబుతాం. కానీ, తర్వాత విందు సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. ''పవన్ కు చాలా భవిష్యత్తు ఉంది. దేశానికే ఆయన నాయకుడు కాగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఆయనను నిశితంగా గమనిస్తున్నా.. చాలా ఫ్యూచర్ ఉంది.'' అని మోడీ ప్రశంసించడం కాదు.. భుజం తట్టి మరీ ప్రస్తావించడం గమనార్హం.
సహజంగానే రాజకీయాల్లో ఒకరినొకరు పొగుడుకోవడం.. ఉంటుంది. కానీ, వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని చేసిన కమెంట్లకు.. ముఖ స్థుతిగా చేసిన వ్యాఖ్యలకు తేడా ఉన్నట్టుగానే.. పవన్ విషయంలో మోడీ ఆధా రాలను ఆధారం చేసుకుని చేసిన వ్యాఖ్యలు.. పవన్ ఇమేజ్ను భారీగా పెంచాయి. సనాతనధ ర్మం ఒక్కటే ఆయనను మోడీకి చేరువ చేయలేదు. ఆయన అనుసరిస్తున్న విదానాలు, గిరిజనులు, గ్రామాలు అంటూ.. చేపడుతున్న కార్యక్రమాలు వంటివి కూడా.. మోడీకి పవన్ ను చేరువ చేస్తున్నాయి. ఇదే. ఆయన ఇమేజ్ను మరోసారి పైపైకి పెంచింది.
Social Plugin