Ticker

6/recent/ticker-posts

ఏపీ విద్యార్థులకు కేంద్రం శుభవార్త.. కేబినెట్‌లో కీలక నిర్ణయం..


INDIA NEWS: అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశంలోని ఐదు ఐఐటీలలో విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలో ఏపీలోని తిరుపతి ఐఐటీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలలో కొత్తగా స్థాపించిన ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటీ)లలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐదు ఐఐటీలలో ఐఐటీ తిరుపతి, ఐఐటీ పాలక్కాడ్, ఐఐటీ భిలాయ్, ఐఐటీ జమ్మూ, ఐఐటీ ధార్వాడ్ ఉన్నాయి.


మొత్తం రూ.11,828.79 కోట్లు ఖర్చుచేసి ఈ ఐదు ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 2028-29 లోగా అంటే నాలుగేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అలాగే ఈ ఐదు ఐఐటీలలో 130 ఫ్యాకల్టీ పోస్టులు పెంచేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే నాలుగేళ్ల కాలంలో ఈ ఐదు ఐఐటీలలో ( తిరుపతి ఐఐటీ) సీట్లను 6500పైగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. మరింత మందికి మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి సంవత్సరంలో 1364 విద్యార్థులు, రెండో సంవత్సరంలో 1738 మంది విద్యార్థులు, మూడో ఏడాదిలో 1767 మంది, నాలుగో ఏడాదిలో 1707 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఐదు ఐఐటీలలో 7111 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఐఐటీలలో మరో 6500 సీట్లను పెంచడం ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో చదువుకోవాలన్న విద్యార్థుల కలను నెరవేర్చవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే నైపుణ్యం కలిగిన యువతను అందించడంతో పాటుగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించవచ్చని.. ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా దేశ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఐఐటీలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, ఫ్యాకల్టీ నియామకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.