ANDRAPRADESH: ఇది మాకు ప్రమాకర సంకేతాలు ఇస్తోంది.`` అని గుంటూరుకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు, వయోవృద్ధుడు లోగుట్టుగా వ్యాఖ్యానించారు. By: SRTV NEWS వైసీపీ అధినేత జగన్కు నిద్రలేని రాత్రులు నడుస్తున్నాయా? పదే పదే ఆయన న్యాయవాదులు.. పార్టీ ముఖ్యులతో మాట్లాడుతున్నారా? తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ``మేం అనుకున్నట్టుగా పరిణామాలు అయితే లేవు. ఏదో మా ర్పు కనిపిస్తోంది. ఇది మాకు ప్రమాకర సంకేతాలు ఇస్తోంది.`` అని గుంటూరుకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు, వయోవృద్ధుడు లోగుట్టుగా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం జగన్ వచ్చే నాలుగేళ్ల తర్వాత గురించి ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. మనదే ప్రభుత్వం ప్రజలు మనవెంటే ఉన్నారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నాయకులను కూడా ఆయన అదే దిశలో నడిపిస్తున్నారు. అలాగే నడవాలని కూడా చెబుతున్నారు. కానీ, వాస్తవానికి.. వచ్చే నాలుగేళ్ల తర్వాత ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర సంకటంలో పడిపోయింది. మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తుల అరెస్టులు.. జైళ్లు భయపెడుతున్నాయి.
``ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు!`` అని కొన్నాళ్ల కిందట జగన్ వ్యాఖ్యానించారు. కానీ, ఆయన ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే జరుగుతుండడం పార్టీలో ఇబ్బందిగా మారింది. ఒకరు అరెస్ట యితే ఓకే.. కానీ.. వరుస పెట్టి అందరూ అరెస్టయ్యారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. తాజాగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ కూడా జైలుకు వెళ్లారు. ఈ పరిణామానికి తోడు..ఇప్పటికే జైల్లో ఉన్న వంశీకి బెయిల్ రావడం లేదు. వచ్చినా.. వేర్వేరు కేసులు నమోదవుతున్నాయి.
దీంతో జగన్ పరిస్థితి దారుణంగా ఉందన్నది పార్టీ నాయకులు చెబుతున్న మాట. అయితే.. ఎవరూ బయటకు చెప్పడం లేదు. కానీ, అంతర్గత సంభాషణల్లో మాత్రం వైసీపీ అధినేతకు నిద్ర పట్టడం లేదన్నది మాత్రం స్పష్టంగా చెబుతున్నమాట. ఒకానొక సందర్భంలో ఫ్రెస్ట్రేషన్కు కూడా జగన్ గురవుతున్నారని అంటున్నారు. ``అందుకే అధికారం కోల్పోకుండా చూడాలని చెప్పా!`` అని ఇటీవల చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్నా.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని.. ప్రముఖ న్యాయవాదులతోనూ చర్చిస్తున్నారని సమాచారం. మరి ఏం చేస్తారోచూడాలి.
Social Plugin