Ticker

6/recent/ticker-posts

మ‌హానాడు ముస్తాబు.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో...!


ANDRAPRADESH, KADAPA: టీడీపీ ప‌సుపు పండుగ మ‌హానాడుకు మ‌రో మూడు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. క‌డ‌ప‌లోని క‌మ‌లా పురం-క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గాల మ‌ధ్య ఉన్న శివారు ప్రాంతంలో హైవేను ఆనుకుని ఉన్న 200 ఎక‌రాల స్థలం లో నిర్వ‌హిస్తున్న మ‌హానాడుకు ఏర్పాట్లు వ‌డివ‌డిగా సాగుతున్నాయి. ఈ ద‌ఫా ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితులు.. పార్టీ జోష్ కార‌ణంగా మ‌హానాడును అధిరిపోయేలా నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 


దీనిలో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయ‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గంలోని స‌గానికిస‌గం మంది అమాత్యులు కడ‌ప‌కు చేరుకున్నారు. అక్క‌డే తిష్ఠ‌వేశారు. ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక‌, మొత్తంగా మూడు రోజులు నిర్వ‌హించే మ‌హానాడులో మూడు రోజులూ చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉండేలా చూస్తున్నారు. తీర్మానాలు కామనే అయినా.. ఈ ద‌ఫా తీర్మానాల‌తో పాటు భ‌విష్య‌త్తును కూడా ప్ర‌స్తావించనున్నారు. 
 
ఇక‌, స‌భా ప్రాంగ‌ణాన్ని దేశ విదేశీ హంగుల‌తో తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా స‌భా ప్రాంగ‌ణాన్ని విదేశీ పుష్పాల‌తో అలంక‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశీయ పుష్పాల‌తో నే అలంకరించినా.. ఈ సారి మాత్రం ముస్తాబుకు ప్రాధాన్యం పెంచారు. దీనికి సంబంధించి కాంట్రాక్టును కూడా ఖ‌రారు చేశారు. అదేవిధంగా భోజ‌నాల‌ను కూడా ప్యాకింగ్ స్ట‌యిల్లో అందించేందుకు రెడీ అయ్యారు. ప్ర‌తిసారీ అక్క‌డే వండి వ‌డ్డిస్తున్నారు. 
 
కానీ, ఈ సారి ఎక్కువ మంది వ‌స్తార‌న్న అంచ‌నాతో సుమారు 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు స‌భ‌ల‌కు హాజ‌రయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిసిన నేప‌థ్యంలో అంత‌మందికి అక్క‌డే వండించి వ‌డ్డించడం ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ సారి ప్యాకింగ్ సిస్ట‌మ్‌ను ఎంచుకుంటున్నారు. దీని వ‌ల్ల ఇబ్బందులు కూడా ఉండ‌బోవ‌ని తెలుస్తోంది. ఇక‌, పార్కింగు కు స‌భా ప్రాంగ‌ణానికి మ‌ధ్య అర‌కిలో మీట‌రు దూరం పెట్టారు. త‌ద్వారా.. ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.