Ticker

6/recent/ticker-posts

లక్ అంటే చినబాబుదే : పేచీ పూచీ లేని లోకేష్ !


ANDRAPRADESH: రాజకీయాల్లో అనేక రకాలైనవి అంతా చూస్తున్నారు. అధికారం చుట్టూ చాలా మంది చేరుతారు. By: SRTV NEWS పవర్ మహిమ అలాంటిది. ఇక దేశంలో ప్రాంతీయ పార్టీల హవా చాలానే ఉంది. ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలుగా బీజేపీ ఎపుడూ చిత్రీకరిస్తూ ఉంటుంది. అంతే కాదు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని కూడా విమర్శలు చేస్తుంది. అయితే దేశంలో ప్రాంతీయ పార్టీల విషయంలో చూస్తే అధినాయకుడు ప్రజాకర్షణతో తన శక్తి సామర్ధ్యాలతో అధికారంలోకి తెస్తారు ఆ తరువాత నుంచి వారసుల సందడి మొదలవుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉంది. పెళ్ళి కాని అధినేత్రులైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీకి అలాగే బీఎస్పీ నుంచి మాయావతికి ఇలాంటి చిక్కులే ఉన్నాయి. మేనల్లుళ్ళు ఇతర రక్త సంబంధీకులు పార్టీ మీద ఆధిపత్యం చేయడం ఈ పార్టీలలో కనిపిస్తుంది. 


యూపీలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజకీయ నాయకత్వం కుమారుడు అఖిలేష్ యాదవ్ దక్కించుకున్నారు. కానీ ఒక దశలో ఆయనకు సవతి సోదరుడు నుంచి పోటీ వచ్చింది. ఇక బీహార్ లో లాలూ పార్టీ ఆర్జేడీకి కూడా కుమారులే వారసులు. అయితే తేజస్వీ యాదవు జోరు చేస్తున్నారు. సోదరి మీసా భారతి, మరో సోదరుడు ఆ పార్టీలో ఇపుడు క్రియాశీలకంగానే ఉన్నారు దక్షిణాన చూస్తే తమిళనాడులో ఎంతో మంది వారసుల పోటీని ఎదుర్కోని కరుణానిధి కుమారుడు స్టాలిన్ పార్టీ మీద పట్టు సంపాదించారు. పెద్దన్నయ్య అళగిరిని విజయవంతంగా సైడ్ చేశారు. సోదరి కనమోళీ మాత్రం పార్టీలో పరిమితమైన స్థాయిలోనే ఉన్నారు. 

కర్ణాటకలో చూస్తే జేడీయూలో పార్టీ పగ్గాలు దేవేగౌడ తమ చిన్న కుమారుడు కుమారస్వామికే కట్టబెట్టారు. అయితే పెద్ద కుమారుడు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. తెలుగు నాటకు వస్తే నాలుగు ప్రాంతీయ పార్టీలు కనిపిస్తాయి అందులో జూనియర్ అయిన జనసేనను పక్కన పెడితే మిగిలిన పార్టీలకు వారసుల బెడద ఉంది. తెలుగుదేశంలో నాయకత్వ పగ్గాలు నందమూరి నుంచి నారా చంద్రబాబు దక్కించుకోవడమే కాదు తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో చేయాల్సి వచ్చింది. ఇక వైసీపీలో వైఎస్సార్ వారసులుగా జగన్ షర్మిల ఉన్నారు. అయితే ఒకసారి మాత్రమే వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ షర్మిలకు ఏ పదవీ దక్కలేదు. దాంతో ఆమె అలిగి పార్టీని వీడిపోయారు. అలా అన్నాచెళ్ళెళ్ల రాజకీయం కళ్ళ ముందే ఉంది 2024లో జగన్ ఓటమికి షర్మిల ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణం అంటారు. 
 
ఇక ఇపుడు చూస్తే బీఆర్ఎస్ లో వారసత్వ పోరు సాగుతోంది. కవిత ఏకంగా తండ్రి కేసీఆర్ కే లేఖ రాసి సంచలనం రేపారు. మరో వైపు హరీష్ రావు కూడా కీలక వారసుడిగా ఉన్నారని విశ్లేషణలు ఉన్నాయి. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాల్సి. ఉంది. ఇక ఇవన్నీ చూస్తూంటే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ఏ పేచీ పూచీ లేని మంచి పొజిషన్ లో ఉన్నారని అంటున్నారు. చంద్రబాబుకు ఆయన ఒకే ఒక కుమారుడు. దాంతో పాటు టీడీపీలో ఎవరూ లోకేష్ ని ఈ రోజుకీ వారసత్వ పరంగా సవాల్ చేసే స్థితిలో లేరు. ఆ విధంగా పూర్వరంగం అంతా బాబు సిద్ధం చేసి పెట్టారు. 

లోకేష్ కి ఏ ఇబ్బంది లేకుండా బాబు వన్ అండ్ ఓన్లీ వారసత్వ నాయకుడిగా లోకేష్ ని పార్టీలో ఉంచారు. దాంతో బాబు నుంచి చాలా సులువుగా నాయకత్వ పగ్గాలు లోకేష్ కి అనుకున్న సమయానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోకేష్ అత్యంత బలమైన వారసత్వ నేతగా ఈ రోజున దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఏ ప్రాంతీయ పార్టీలో వారసుడికి లేని సుఖం లోకేష్ కి ఉంది అని అంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు పార్టీలో వారసుల పోరు చూసిన వారు చిన బాబు వెరీ లక్కీ అని అంటున్నారు.