Ticker

6/recent/ticker-posts

రేషన్ బళ్ళు ఇక ఇంటికి రావు...ఓకేనా ?


ANDRAPRADESH: వైసీపీ హయాంలో ఇంటింటికీ రేషన్ అని ఒక విధానం తీసుకుని వచ్చింది. దాని ప్రకారం చూస్తే ప్రతీ రేషన్ దుకాణానికి ఒక వాహనం ఉండేది. By:  SRTV NEWS ఆ వాహం ఆ రేషన్ కార్డుదారుల ఇళ్ళ వద్దకు వెళ్ళేది. ఇలా వారం రోజుల పాటు రేషన్ బండి తిరిగేది. దాంతో తమ వీధిలో కాకపోయినా పక్క వీధిలో అయినా రేషన్ తీసుకునే వీలు ఉండేది. పైగా తమకు నచ్చిన టైం లో తీసుకునేవారు. రద్దీగా ఉంటే మరోసారి వెళ్ళేవారు. ఒక విధంగా ఈ విధానం గత నాలుగేళ్ళుగా అమలులో ఉంది. దీని కోసం ఆనాటి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి పౌర సరఫరాల కోసం వాహనాలు కొనుగోలు చేసింది. 


అయితే వీటి ద్వారా ప్రజలకు ఇంటింటికీ రేషన్ సరకు అందుతోంది. అయితే ఈ వాహనాలకు ఖర్చు పెట్టడం ఆర్థిక భారంగా ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారు. దాని కోసం బడ్జెట్ బాగా ఖర్చు అవుతోంది అన్నది పౌర సరఫరాల శాఖ ఆలోచనగా ఉంది. దాంతో గత కొంతకాలంగా ఈ విషయం మీద సీరియస్ గానే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తమ వాహనాలను ఆపేస్తే ఉపాధి పోతుందని ఒక వైపు వాహదారులు అంటున్నారు. అయితే ప్రభుత్వానికి ఖర్చు తో పాటు ఇతర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తానికి ఇంటింటికీ రేషన్ వాహనాలను నిలుపుదల చేస్తూ ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. 

దీంతో జూన్ 1 నుంచి ఇక రేషన్ దుకాణాల వద్దకే లబ్దిదారులు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడే వారికి రేషన్ ఇస్తారు. ఇది పూర్వం నుంచి ఉన్న విధానమే. అయితే మరి క్యూలు ఉంటాయని దుకాణాలు ఎపుడూ తెరుస్తారో ఎపుడు మూసేస్తారో తమకు సమాచారం ఉండదని జనాలు గతంలో ఫిర్యాదులు చేసేవారు. మరి ఇపుడు అలాంటివి జరగకుండా ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంది. అంతే కాదు నెలాలో పదిహేను రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ దుకాణాలను రేషన్ డీలర్లు తెరచి ఉంచేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

అంతే కాదు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా కోరుతున్నారు. ఇవన్నీ సరే కానీ ఇంటింటికీ రేషన్ వాహనాల ద్వారా వచ్చి తాము అందించామని వైసీపీ చెప్పుకోవడానికి ఒక అస్త్రం కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే కనుక ప్రజలు దీనిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు.