జీలుగుమిల్లి/ బర్రింకలపాడు: ఏలూరు జిల్లా పోలవరం ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులతో జిల్లా డీఆర్డీఏ పీడీ విజయరాజు బుధవారం ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. జీలుగుమిల్లిలోని బర్రింకల పాడు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు విచ్చే సారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల పట్ల ఎన్డీయే ప్రభుత్వం చిత్త శుద్ధిగా వ్యవహరిస్తోందని ఈ సందర్బంగా ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు.
ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిర్వాసితుడికి ఆ హామీలు అమలు పరిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేసారు. రాబోయే రోజుల్లో వరదలు వచ్చే నేపథ్యం నిర్వాసితులను అప్రమత్తం చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి కుటుంబం ఆర్ధిక అభివృద్ధి కై అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాలోచన చేస్తున్నారనిచెప్పారు. నిర్వాసితుల్లో ఉన్నత చదువులు చదువుకున్నవారికి ప్రతేకంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, అలాగే రైతులకు వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక రుణాల కోసం అధికారులతో ససంబంధిత మంత్రులతో చర్చిస్తున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అలాగే నిరుద్యోగ యువత కోసం ప్రతివారికి వ్యాపారఅవకాశం వారికి ఉపాది కల్పించే దిశగా బ్యాంకర్లతో మాట్లాడి రుణసదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లుభరోసా ఇచ్చారు. ఈ అవకాశాలను నిర్వాసిత ప్రజలు సద్వినియోగపరచు కోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రాముల నాయక్, ఆర్డీవో ఎం.వి రమణ, వ్యవసాయ శాఖ ఏ.డి బుజ్జి బాబు తదితరులు పాల్గొన్నారు.
Social Plugin