జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: ఆంద్రప్రదేశ్ ఎస్సి కమీషన్ ఛైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ని ఏపి ఎమ్మార్పీఎస్ జిల్లా అద్యుక్షులు గొల్లమందల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు ఎం ఆర్ పి ఎస్ నేతలు సోమవారం ఆయన నివాసంలో కలసి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేశారని అభినందనలు తెలిపారు.
సమిష్టిగా పని చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మన నాయకులు ఎప్పుడూ పార్టీ వెంటే ఉండి కష్టపడి తెదేపా పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు. తనను గౌరవించిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. కాగా మన నాయకుడు జవహర్ కి ఈ పదవి రావడం ఎంతో ఆనందంగా ఉందని గొల్లమందల అన్నారు. ఈ కార్యక్రమంలో లాగు ప్రకాష్, కలపాల శ్రీనివాసరావు, జొన్నకూటి శ్రీనివాసరావు, కడిమి రాజేష్ పాల్గొన్నారు.
Social Plugin