Ticker

6/recent/ticker-posts

ఆంధ్రా ఇందిర‌మ్మ‌.. సెటైరా... కాంప్లిమెంటా


ANDRAPRADESH: ఆంధ్రా ఇందిర‌మ్మ‌.. అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. BY: SRTV NEWS ఇవి ఆమెను ఉద్దేశించి చేస్తున్న సెటైర్లా.. లేక నిజంగానే ఆమెను పొగ‌డుతూ.. కాంప్లిమెంట్లు ఇస్తున్నారా? అనే విష‌యంపై సందేహం నెల‌కొంది. తాజాగా రాష్ట్రంలో ఏ స‌మ‌స్యా లేన‌ట్టుగా.. ష‌ర్మిల విశాఖ‌ప‌ట్నంలోని స్టీల్ ప్లాంట్ విష‌యంపై ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగారు. ఇది స‌మ‌స్యే కాద‌ని అన‌లేం. కానీ.. ఇది చాన్నాళ్లుగా ఉంది. 


పైగా దీనిపై రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు ప‌రిశీల‌న చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు ప‌రం కాకుండా చూస్తామ‌ని చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు కూడా ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఇక‌, వైసీపీ హ‌యాంలో నే మొగ్గ తొడిగిన ఈ ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ఆపాలంటూ.. అప్ప‌టి సీఎం గా జ‌గ‌న్ కూడా కేంద్రానికి లేఖ సంధించారు. ఇంత జ‌రుగుతున్న ఈ విష‌యంపై ఇటీవ‌ల కాలంలోనే స్పందించిన ష‌ర్మిల‌.. తాజాగా విశాఖ స్టీల్ ప్టాంట్ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తు అంటూ.. దీక్ష‌కు దిగారు. 

దీనిపై సొంత పార్టీలోనే ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సీనియర్ నాయ‌కులు ఎవ‌రూ కూడా ఈ నిర‌స‌న‌లో పాల్గొన‌లేదు. అంతేకాదు.. శ్రీకాకుళానికే చెందిన కాంగ్రెస్ నాయ‌కురాలు కిల్లి కృపారాణి వంటి వారుకూడా దూరంగానే ఉన్నారు. ఇక‌, మిగిలిన నాయ‌కులు ఎవ‌రూ కూడా ష‌ర్మిల‌తో క‌లిసి ధ‌ర్నాకు కూర్చోలేదు. సో.. ఈ ప‌రిణామాల‌తో ష‌ర్మిల దీక్ష కేవ‌లం తూతూ మంత్రంగానే సాగింద‌న్న‌ది నిజం. ఇక‌, ప్ర‌ధాన మీడియా కూడా దీనిపై పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేదు. 
 
ఇక‌.,.. పోలీసులు కూడా.. రాత్రికి రాత్రి జోక్యం చేసుకుని ఆమెను విమానాశ్ర‌యానికి త‌ర‌లించేశారు. వాస్త‌వానికి దీక్ష చేసిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. కానీ, ష‌ర్మిల విష‌యంలో అది కూడా అన‌వ‌స‌రం అనుకున్నారో.. ఏమో.. ఆమెను హైద‌రాబాద్ పంపేసే ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే ప‌లువురు నెటిజ‌న్లు ఆంధ్రా ఇందిర‌మ్మ అంటూ కామెంట్లు చేశారు. అయితే.. దీని వెనుక సెటైర్లే ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇందిర‌మ్మ కూడా.. ప‌రిస్థితుల‌కు త‌గిన విధంగా స్పందించ‌కుండా.. త‌నకు తోచిన విదంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. అలానే ష‌ర్మిల చేస్తున్నార‌న్న కోణంలో ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బ‌ట్టి ష‌ర్మిల తాను చేసింది క‌రెక్టో కాదో స‌మీక్షించుకోవాలి.