Ticker

6/recent/ticker-posts

ఏపీకి మోడీ సూపర్ గుడ్ న్యూస్... చంద్రబాబు, పవన్ థ్యాంక్స్!


INDIA, ANDRAPRADESH: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పాటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో ఏపీలోని టీడీపీ, జనసేనలు కీలక భూమిక పోషిస్తున్నాయి! ఈ సమయంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఏపీకి గుడ్ న్యూస్ వెలువడింది. ఇందులో భాగంగా... బద్వేల్ - నెల్లూరు మధ్య నాలుగు లైన్ల రహదారిని కేంద్రం మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. దీనిపై మోడీ ఇంగ్లిష్, తెలుగు రెండింటిలోనూ 'ఎక్స్' లో పోస్ట్ పెట్టడం గమనార్హం.


వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా గురువిందపూడి మధ్య రూ.3,653 కోట్లతో 108.13 కి.మీ. పొడవున నాలుగు లైన్ల నేషనల్ హైవే నిర్మాణం చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇది నేషనల్ హైవే 67లో వైఎస్సార్ కడప జిల్లాలోని గోపవరం వద్ద ప్రారంభమై, నేషనల్ హైవే 16లో నెల్లూరు జిల్లా గురివిందపూడి వద్ద ముగుస్తుంది. ఈ నిర్మాణం చేపట్టే కారిడార్ తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం సుమారు 33.9 కి.మీ. తగ్గనుంది. ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది. ఇది కచ్చితంగా ఏపీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ ప్రయోజనం స్పష్టమవుతుందని అంటున్నారు

ఈ నిర్ణయంపై 'ఎక్స్' వేదికగా తెలుగులో స్పందించిన ప్రధాని నరేంద్ర మొడీ... కేబినెట్ ఆమోదం పొందిన 4 లెన్ల బద్వేల్ - నెల్లూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రయోజనం చేకూరుస్తుందని.. రాష్ట్ర యువతకు పలు అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... కేంద్ర మంత్రివర్గం 4 లేన్ల బద్వేల్-నెల్లూరు కారిడార్‌ కు ఆమోదం తెలపడం మన రాష్ట్ర వృద్ధిలో ఒక ప్రధాన ముందడుగని.. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించడంతో పాటు మన యువతకు సాధికారత కల్పించడం అని చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా.. మోడీ, నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్రకటనపై స్పందించిన పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణ ఆంధ్ర 2047కు ఈ నిర్ణయం బలమైన పునాది వేస్తుందని.. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు దోహం చేస్తుందని.. రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని అన్నారు.