ANDRAPRADESH, ELURU: యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లాలో పెద్దఎత్తున ప్రజలను భాగస్వామ్యములను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం సంబంధిత శాఖల కార్యదర్సులతో రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలోని 2. 20 కోట్ల మంది ప్రజలను యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలని, జూన్, 21వ తేదీన ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో లక్ష ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర పోటీలు నిర్వహించాలన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం అనంతరం కూడా యోగాను ప్రతీ ఒక్కరూ కొనసాగించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంపై తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సిఎస్ కి తెలియజేస్తూ జిల్లాలో 8. 30 లక్షల మంది ప్రజలను యోగా కార్యక్రమంలో పాల్గొనేలా లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇంతవరకు 4. 12 లక్షల మంది ప్రజలు యోగా కార్యక్రమంలో నమోదై, యోగా చేస్తున్నారన్నారు.
జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జెడ్పి సీఈఓ కె. భీమేశ్వరరావు, డిఆర్డిఏ పీడీ విజయరాజు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Social Plugin