Ticker

6/recent/ticker-posts

అధికారుల పల్లెబాట...కూటమి వినూత్న ప్రయోగం


ANDRAPRADESH: టీడీపీ కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. By:  SR TV NEWS టీడీపీ కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టుకుని వచ్చిన ఒక మహత్తర కార్యక్రమం పేరే అధికారుల పల్లె నిద్ర. సాధారణంగా అధికారులు ఉండేది ఆఫీసులలో. కట్టుదిట్టమైన భవంతులలో. వారిని కలవాలి అంటే సామాన్యుల వశం కాదు. ఉన్నతాధికారుల దర్శనం కోసం ఒక విధంగా పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది ఇక సమస్యలు ఏవైనా పెద్ద అధికారులకు చెప్పుకోవాలీ అంటే అది ఎంత కష్టసాధ్యమో అందరికీ తెలిసిందే. 


అటువంటిది అధికారులనే స్వయంగా తమ పల్లెలకు పంపించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వారే పల్లెలకు వస్తారు. అక్కడ ఏకంగా రాత్రి బస చేసి పల్లె నిద్ర చేస్తారు. ఆ మీదట అక్కడ రచ్చ బండ సమావేశాలు నిర్వహించి ఆయా పల్లెలలో ఉన్న సమస్యలను తెలుసుకుంటారు. వాటి పరిష్కారానికి కూడా కృషి చేస్తారు. అధికారులు ఎంతో తర్ఫీదు పొంది శిక్షణ తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నా కూడా గ్రౌడ్ లెవెల్ రియాలిటీస్ చాలా మందికి తెలియవు. దాని వల్లనే సమస్యలకు సరైన పరిష్కారాలు సత్వరమే లభించడం లేదు అని అంటున్నారు. 

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మధ్యన నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అధికారులను పల్లె నిద్ర చేయని సూచించారు. మామూలుగా అయితే ప్రజా ప్రతినిధులు వెళ్తూంటారు. వారికి అవగాహన ఉంటుంది. అధికారులకు కూడా ఈ తరహా చైతన్యం రావాలి కదా అని సీఎం వారితో అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర సాధనకు సంకల్పం అని పేరు కూడా పెట్టారు. ఈ నెల 21,22, 23 తేదీలలో మూడు రోజుల పాటు అధికారులు అంతా పల్లె నిద్ర చేస్తారు. రాష్ట్రంలో కీలకమైన అధికారులు పల్లెలకు రావడం గ్రామాల ప్రజలతో మమేకం కావడం మంచి పరిణామమని అంతా అంటున్నారు. 

ఇక తమ వద్దకే అధికారులు వస్తూంటే తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా వీలు అవుతుందని అంటున్నారు. వేసవి కాలంలో అధికారులు పల్లె నిద్రకు రావడం వల్ల కూడా ఎక్కువ సమస్యలు వారి దృష్టికి వస్తాయని అంటున్నారు గ్రామాలలో ఉండే తాగు సాగు నీరు సమస్యలతో పాటు స్థానికంగా పేరుకుని పోయిన అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని రావచ్చు అన్నది జనం మనోగతంగా ఉంది. ఇక ఉన్నతాధికారులు వివిధ శాఖల ఇతర అధికారులతో కలసి గ్రామ సచివాలయాలలో అలాగే అంగన్ వాడీ భవనాలలో బస చేస్తారు. 

వారు రెండు రాత్రులు మూడు పగళ్ళు పల్లెలలో గడుపుతారు అని అంటున్నారు. ఒక విధంగా ఇది ప్రజల వద్దకు పాలన అని అంటున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే ఏపీ దేశానికే ఆదర్శంగా ఉంటుందని కూడా అంతా అంటున్నారు. మొత్తానికి అధికారులు తమ కార్యాలయాలను పటాటోపాలను వీడి జనం వద్దకు పల్లె ముంగిటకు రావడం అన్నది మంచి పరిణామంగానే అంతా చూస్తున్నారు.