తెలంగాణ సర్కార్ వృద్ధులకు శుభవార్త చెప్పింది. అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక జెరియాట్రిక్ సేవలు తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు, అనవసర సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే రిఫర్ చేయాలని, ప్రైవేట్కు పంపొద్దని స్పష్టం చేశారు.
తెలంగాణ సర్కార్ వృద్ధులకు శుభవార్త చెప్పింది. అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక జెరియాట్రిక్ సేవలు తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు, అనవసర సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే రిఫర్ చేయాలని, ప్రైవేట్కు పంపొద్దని స్పష్టం చేశారు.
వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, మతిమరుపు మొదలైనవి వేరుగా ఉంటాయని, వారికి ప్రత్యేక వైద్య విధానం అవసరమని మంత్రి స్పష్టం చేశారు. చికిత్సల పేరిట ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఐవీఎఫ్ (IVF) కేంద్రాలు, పెయిన్ క్లినిక్లు, రీహాబిలిటేషన్ సెంటర్లు వంటి వాటిల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులను ఉపేక్షించవద్దని మంత్రి స్పష్టం చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అనవసరంగా సిజేరియన్లు మాత్రమే చేస్తున్న ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించి, కారణాలను సమీక్షించాలని అధికారులకు సూచన చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన చికిత్స అవసరమైతే వారిని మరో ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే రిఫర్ చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడాన్ని నిషేధించారు. డీఎంహెచ్ఓలు, సూపరింటెండెంట్ల హాజరును ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా, వారి పరిధిలోని సిబ్బంది హాజరును కూడా వీరు సరిగ్గా పర్యవేక్షిస్తున్నారో లేదో గమనిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడం, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడంపై దృష్టి పెట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


.jpeg)
