ANDRAPRADESH, ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జగజ్జనని, జగన్మాత, కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాలిళి మాత BY: SRTV NEWS జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలుతీర్చి, భక్తుల పాలిటి కొంగుబంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం సందర్భంగా సుందరముగా అలంకరించి, విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.
ఆలయ కళ్యాణకళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీజలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకాదశ హారతి పూజలు, వేదదర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు.
ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ.. భక్తులకు వేసవి ఎండల తీవ్రత నుండి ఉపశమనం కలగాలని చల్లటి మజ్జిగను ఎస్.బి.ఐ చీఫ్ మేనేజర్ ఎ. రాజేష్ వాసంతి దంపతులు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బత్తిన నాగ లక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చల్లటి మజ్జిగను వితరణ చేశామని అన్నారు.
అమ్మ వారికి స్థానిక నిమ్మగడ్డ సత్యనారాయణ(బాబీ) విజయలక్ష్మి దంపతులు, నిమ్మగడ్డ రామకృష్ణ, కుసుమ కుటుంబ సభ్యులు 10తులాల వెండిని అమ్మ వారి వెండి చీర తయారీకి సమార్పించారని తెలిపారు. మే నెల 19న ఆలయ పునర్నిర్మాణం చేసి ఆరు వసంతాలు పూర్తి అవుతున్న శుభ సందర్భంగా అమ్మ వారికి అష్టోత్తర శత కళాశాలతో పూజ, పంచామృతాలతో అభిషేకాలు ఏకాదశ హారతి పూజలు వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహా మంత్ర పుష్పాలతో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, అందరికీ ఇదే మా ఆహ్వానం అని అన్నారు.
అమ్మ వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మ వారి వెండి చీర తయారిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
"శ్రీనూకాంబిక ప్రసాద వితరణ భక్తబృందం" చక్కెర పొంగలి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin