అశ్వరావుపేట: నియోజకవర్గం తిరుమలకుంట గ్రామానికి చెందిన యువ న్యాయవాది కొనకళ్ల అంకిత ఇటీవల ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో విజయం సాధించిన సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) నాయకులు సోయం వీరభద్రం గారు ఆదివారం (19-01-2026) అంకిత స్వగృహం వద్ద ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం గారు మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుందని, గ్రామానికి చెందిన యువతి అంకిత జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని అన్నారు. న్యాయవాద రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాభినందనలు తెలిపారు. అనంతరం అంకిత తల్లిదండ్రులు కొనకళ్ల శ్రీనివాసరావు – విజయలక్ష్మి గార్లను శాలువాతో సత్కరించారు.
తదుపరి అశ్వరావుపేట మండలం బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జుజ్జరి వెంకన్నబాబు గారిని వారి నివాసంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుమలకుంట గ్రామ పంచాయతీ నుంచి బి.ఆర్.ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన మాడి ముత్యాలరావు గారిని వారి ఇంటి వద్ద కలిసి ఓటమి గల కారణాలపై చర్చించారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచిస్తూ ముత్యాలరావు గారికి సోయం వీరభద్రం గారు మనోధైర్యం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు బొల్లికొండ చెన్నారావు, జుజ్జరి సత్యనారాయణ, యువజన నాయకులు పానుగంటి చెన్నారావు, దాసరి రాజా, సిరి బత్తుల శ్రీనివాసరావు, కోర్సా జోగారావు, పోతురాజు, మోడియం పుల్లయ్య, కుర్సం వెంకటేష్, డెరంగుల చిన్నబాబు, రామకృష్ణ, మడకం ముత్యాలరావు, మధులత, మాడి సీతతో పాటు అశ్వరావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి గారు మరియు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.


.jpeg)
